ఆర్థిక సాధికారతకు శిక్షణలే బలమైన పునాది

ఆయుధం న్యూస్ హనుమకొండ ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన పెంపొందించేందుకు నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమాలను సద్వినియోగం చేసుకుని మహిళలు, కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్లు (సీఆర్పీలు) తమతో పాటు సమాజ ఆర్థికాభివృద్ధికి దోహదపడాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయి సూచించారు.శుక్రవారం హనుమకొండ జిల్లా హసన్‌పర్తి మండల కేంద్రంలోని సంస్కృతి విహార్‌లో ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ (ఎస్‌బీఐ ఆర్‌సెటీ)లో ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన 64 మంది కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్లకు నిర్వహిస్తున్న ఆర్థిక అక్షరాస్యత అవగాహన...