పాల‌మూరు-రంగారెడ్డి, గౌర‌వెల్లి, సీత‌మ్మ సాగ‌ర్‌, డిండి ప్రాజెక్టుల‌కు స‌త్వ‌ర‌మే ప‌ర్యావ‌ర‌ణ అనుమ‌తులు మంజూరు చేయాలి

ఆయుధ న్య‌స్ ఢిల్లీ: పాల‌మూరు-రంగారెడ్డి, గౌర‌వెల్లి, సీత‌మ్మ సాగ‌ర్‌, డిండి ప్రాజెక్టుల‌కు స‌త్వ‌ర‌మే ప‌ర్యావ‌ర‌ణ అనుమ‌తులు మంజూరు చేయాల‌ని కేంద్ర అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ శాఖ మంత్రి భూపేంద‌ర్ యాద‌వ్‌ కి ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞ‌ప్తి చేశారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి, రాష్ట్ర నీటి పారుద‌ల శాఖ మంత్రి ఉత్త‌మ్ కుమార్ రెడ్డి తో కలిసి పార్ల‌మెంట్‌లో కేంద్ర మంత్రి భూపేంద‌ర్ యాద‌వ్‌ తో స‌మావేశ‌మ‌య్యారు. తెలంగాణ సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి ఇటీవ‌ల సుప్రీంకోర్టు సానుకూల తీర్పు ఇచ్చిన నేప‌థ్యంలో, ఈ ప్రాజెక్టులకు...