అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలి: హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్

ఆయుధం న్యూస్ వ‌రంగ‌ల్ అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలని గ్రేట‌ర్ వ‌రంగ‌ల్ మునిసిఫ‌ల్ కార్పోరేష‌న్ ప్రత్యేక అధికారి హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ అభిప్రాయపడ్డారు. శనివారం 80 వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని మునిసిఫ‌ల్ కార్పోరేష‌న్ ప్రధాన కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ప్రత్యేక అధికారి హోదాలో ముఖ్య అతిథిగా హాజరై కమిషనర్ టి.వెంకన్నతో కలసి జాతీయ జెండాను ఎగురవేసి, వందనం సమర్పించి జాతీయ గీతం, జాతీయ గేయంతో పాటు రాష్ట్ర అవతరణ గీతాన్ని ఆలపించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో...