సామాజిక న్యాయం కోసం అందరికీ సమాన అవకాశాలను కల్పించాలన్న లక్ష్యంతో బీఆర్ అంబేద్కర్ జయంతి నాడు తెలంగాణ ప్రజా ప్రభుత్వం ఎస్సీ ఉపకులాల వర్గీకరణ గెజిట్ నోటిఫికేషన్ను విడుదల చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మంత్రివర్గ ఉపసంఘం జీవో తొలి కాపీని అందజేసింది.డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రులు దామోదర రాజనర్సింహ, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస రెడ్డి. పోన్నం ప్రభకర్, ప్రభుత్వ సలహదారు వేం నరేందర్ రెడ్డి,మాజీఎంపి పోరిక బలరాం ఏకసభ్య కమిషన్ చైర్మన్ జస్టిస్ షమీమ్ అఖ్తర్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు