ePaper
Monday, May 25, 2026
ePaper
Homeఆంధ్రప్రదేశ్కాలుష్యరహిత గోదావరి పుష్కరాలు నిర్వహణకు ప్రభుత్వం కట్టుబడి ఉంది:ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్

కాలుష్యరహిత గోదావరి పుష్కరాలు నిర్వహణకు ప్రభుత్వం కట్టుబడి ఉంది:ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్

📰 Generate e-Paper Clip

ఆయుధం న్యూస్ రాజమహేంద్రవరం
రాజమహేంద్రవరం గోదావరి పుష్కర ఘాట్ నుంచి కోటిలింగాల ఘాట్ వరకు పడవలో ప్రయాణించి గోదావరి తీర కాలుష్యాన్ని,పుష్కర పనులను స్వయంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పరిశీలించారు.‘గోదావరి నదిలోకి ప్రవేశిస్తున్న కాలుష్య వ్యర్థాలు, జలాలు వాటి నిర్వహణపై పూర్తిస్థాయి ఆడిట్ నిర్వహించి నివేదిక సమర్పించండని. ఇప్పటివరకు ఏ చర్యలు తీసుకున్నారు..? భవిష్యత్తులో చేపట్టాల్సిన పనులకు స్పష్టమైన ప్రణాళికను సిద్ధం చేయండఅని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాష్ట్ర ఉన్నతాధికారులకు, తూర్పు గోదావరి జిల్లా అధికారులకు సూచించారు. వచ్చే ఏడాది గోదావరి పుష్కరాలను ‘కాలుష్య రహిత గోదావరి’ అనే ఇతివృత్తంతో నిర్వహించడానికి సంకీర్ణ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు. తన రాజమహేంద్రవరం పర్యటనలో భాగంగా, సోమవారం ఉదయం పవన్ కళ్యాణ్ రాజమహేంద్రవరం పుష్కర ఘాట్ నుంచి కోటిలింగాలు ఘాట్ వరకు పడవలో ప్రయాణించి, గోదావరి జలాల్లో కాలుష్యానికి కారణమవుతున్న ప్రాంతాలను పరిశీలించారు.

పుష్కరాల సమయంలో చేయాల్సిన పనుల స్థితిని, త్వరలో చేపట్టబోయే పనుల ప్రణాళికలను ఆయన స్వయంగా సమీక్షించారు. పుష్కరాల నేపథ్యంలో గోదావరి ఘాట్‌ల సుందరీకరణ పనులు ఎంతవరకు పురోగమించాయో, ఘాట్‌లను ఎలా మెరుగుపరచనున్నారో అధికారులు ఆయనకు వివరించారు. ఈ సందర్భంగా, చింతలమ్మతోట ఘాట్ వద్ద, రాజమహేంద్రవరం మురుగునీరు నల్లా కాలువ ద్వారా గోదావరిలో కలిసే ప్రాంతాన్ని పవన్ కళ్యాణ్ స్వయంగా పరిశీలించారు. నదీ తీరం వెంబడి ఏ స్థాయిలో కాలుష్యం జరుగుతుందో ఆయన స్వయంగా చూశారు. నీటిని ఎలా శుద్ధి చేస్తున్నారనే వివరాలను ఆయన అడిగి తెలుసుకున్నారు. ఆయన అక్కడి సిబ్బందితో మాట్లాడి, వ్యర్థాలను వేరుచేసే పద్ధతిని పరిశీలించారు.ఈ సందర్భంగా అధికారులకు సూచనలు జారీ చేస్తూ పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, “లెక్కల ప్రకారం ప్రతిరోజూ సుమారు 55 మిలియన్ లీటర్ల (MLD) మురుగునీరు గోదావరిలో కలుస్తోంది. ఈ మురుగునీటి శుద్ధి ప్రక్రియను శాస్త్రీయ పద్ధతిలో చేపట్టాలి. మురుగునీటిని నేరుగా గోదావరిలోకి వదలడం వల్ల జలాలు కలుషితమవుతున్నాయని ఫిర్యాదులు వస్తున్నాయి. దీనిపై దృష్టి సారించాలి. నిధులను సముచితమైన పనులకు వినియోగిద్దాం” అని అన్నారు.గోదావరి పుష్కరాలపై ఖర్చు చేసే ప్రతి పైసా ప్రజలకు ప్రయోజనం చేకూర్చే మరియు గోదావరి నదీ తీరాలను పరిరక్షించే పనులకే వినియోగించాలి. ముందుగా, కాలుష్య కారకాలపై పూర్తిస్థాయి ఆడిట్ నిర్వహించాలి. ఆ తర్వాత, వాటిని ఎలా అధిగమించాలనే దానిపై దృష్టి సారించవచ్చు. కేవలం సంఖ్యలతోనే కాకుండా, పూర్తి కార్యాచరణ ప్రణాళికతో ముందుకు సాగుదాం. కేంద్ర జలశక్తికి చెందిన రూ. 416 కోట్ల ఎన్‌ఆర్‌సిపి నిధులలో, రూ. 95 కోట్ల నిధులకు పరిపాలనా ఆమోదాలు లభించాయి. ఈ నిధులతో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కొత్త శుద్ధి కర్మాగారాలను నిర్మించాలి. మురుగునీటి రహితంగా గోదావరిలోకి నీటిని విడుదల చేసే బాధ్యతను మనం తీసుకోవాలని అధికారులకు సూచించారు.

పడవ ప్రయాణం…..

పడవ ప్రయాణం మొదలుపెట్టి మున్సిపల్ కార్యాలయానికి చేరేంత వరకు, గోదావరి కాలుష్యాన్ని నివారించడానికి తీసుకోవాల్సిన చర్యల గురించి పవన్ కళ్యాణ్ అధికారులను వివరంగా ప్రశ్నించారు. ముఖ్యంగా, ఆయన నేరుగా ఒక శుద్ధి కర్మాగారం ప్రదేశానికి వెళ్లి, అక్కడ వ్యర్థాలను వేరు చేయడాన్ని కూడా పరిశీలించారు. ఆ వ్యర్థాలతో ఏమి చేస్తారని ఆయన ఆరా తీశారు. మురుగునీటి శుద్ధికి ప్రస్తుతం ఎలాంటి శాస్త్రీయ పద్ధతిని ఉపయోగిస్తున్నారనే వివరాలను ఆయన అడిగారు. కొత్త పద్ధతులు వస్తున్నాయని, వాటికి అనుగుణంగా ఎప్పటికప్పుడు నవీకరణలు చేయాలని అధికారులు సూచించారు. అక్కడి నుండి, పుష్కర పనుల సమీక్ష కోసం ఆయన నేరుగా రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయానికి చేరుకున్నారు. పవన్ కళ్యాణ్ గారితోపాటు మంత్రులు నాదెండ్ల మనోహర్ , కందుల దుర్గేష్ , శాసన మండలిలో ప్రభుత్వ విప్ పిడుగు హరిప్రసాద్ , ఎమ్మెల్సీ సోము వీర్రాజు , ఎమ్మెల్యేలు ఆదిరెడ్డి వాసు , గోరంట్ల బుచ్చయ్య చౌదరి , బత్తుల బలరామకృష్ణ , నల్లమిల్లి రామకృష్ణారెడ్డి , రాష్ట్ర పోలీసు హౌసింగ్ బోర్డ్ చైర్మన్ కళ్యాణంశివ శ్రీనివాస్ , అటవీ శాఖ ముఖ్య కార్యదర్శి కాంతిలాల్ దండే , జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరిర, ఎస్పీ నరసింహ కిషోర్రు, రాజమండ్రి నగర పాలక సంస్థ కమిషనర్ రాహుల్ మీనా తదితరులు ఈ పర్యటనలో పాల్గొన్నారు.

 

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!