ఆయుధంన్యూస్ హైదరాబాద్ :
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణాసంస్థ గ్రేటర్ హైదరబాద్ నగరంలో కూకట్ పల్లి బస్ డిపోలో జ్యోతి ప్రజ్వలన చేసి జెండాఊపి ఎలక్ట్రిక్ బస్సులను వెహికిల్స్ ను తెలంగాణ రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించడం జరిగింది. కూకట్పల్లి డిపోలో 60 ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించారు. అనంతరం నూతన ఎలక్ట్రిక్ బస్సులో ప్రయాణించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ నవీన్, కమ్మ కార్పొరేషన్ ఛైర్మన్ బండి రమేష్ ,ఆర్టీసీ ఎం.డి నాగిరెడ్డి, మేడ్చల్ జిల్లా కలెక్టర్ మను చౌదరి ఆర్టీసి సిబ్బంది పాల్గోన్నారు.

